Galla Jayadev : ఒకే రాజధాని ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

రాష్ట్రానికి రాజధాని లేక పోతే అభివృద్ది అసాధ్యంమని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. ఇవాళ 43వ రోజు కొనసాగుతున్న న్యాయస్ధానం-దేవస్ధానం మహా పాదయాత్రకు గల్లా జయదేవ్ సంఘీభావం తెలిపి పాదయాత్రలో‌ భాగస్వామ్యం అయ్యారు.. రేణిగుంట నుండి రైతులతో పాటు పాదయాత్రలో నడుచుకుంటూ ఆయన మద్దతుని తెలియజేశారు.. రేణిగుంట నుండి ప్రారంభంమైన మహా పాదయత్రకు అడుగడునునా రైతులు,ప్రజలు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.‌ఈ సందర్భంగా ఏబీపీ దేశంతో ఆయన మాట్లాడుతూ...ఆంధ్ర ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని, ప్రజల కోరిక మేరకు ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు.‌ అమరావతి రైతులు చేస్తున్న ఈ పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని, రైతుల పాదయాత్రకు అనేక అడ్డంకులు వచ్చినా మహిళా రైతులు అవేవి పట్టించు కోకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు. మూడు రాజధానుల వల్ల ఏపీ ప్రజలు నష్ట పోయే అవకాశం ఉందన్నారు.రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండే ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని గల్లా జయదేవ్ అన్నారు..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola