Deputy CM Pushpa Srivani: విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన ఘటన దారుణం
విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన సంఘటన దారుణమని..డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. నిందితుడిని బాధితులైన విద్యార్థినులు గుర్తించారు. అతడిపై గతంలో కూడా పలుకేసులు ఉన్నట్లు తెలిసింది. అతడిపై అనేక కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉంది. అతను వాడుతున్న వాహనంపై పోలీసు, ప్రెస్ అని స్టిక్టర్లు ఉన్నాయి. నిందితుడు తప్పు చేయడానికి వ్యవస్థలను సైతం వాడుకున్నాడు. పోలీసులు ఈ విషయంలో వెంటనే స్పందించి నిందితుడిని పట్లుకున్నారు. బాధితులకు పూర్తిగా సహాయ సహాకారాలు అందిస్తామని అని పుష్ప శ్రీవాణి తెలిపారు.