CID Notice To Raghu Ramkrishna Raju|విచారణకు రావాలంటూ ఏపీ సీఐడీ నోటీసులు
హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. గురువారం విచారణకు రావాలని రఘురామకు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ పోలీసులు వచ్చారు. అయితే రేపు నర్సాపురం వెళ్లనున్నట్లు... అక్కడ రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు రఘురామకృష్ణ ఇంతకుముందే ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రఘురామపై కేసు నమోదు చేశారు.