Chandrababu Kuppam Tour: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. TDP అధినేత Chandrababu Naidu రెండో రోజు పర్యటనను అడ్డుకుంటామంటూ వైకాపా శ్రేణులు ఇది వరకే ప్రకటించారు. చంద్రబాబు ప్రారంభఇంచాల్సిన అన్న క్యాంటీన్ ప్రాంగణాన్ని YSRCP నేతలు ధ్వంసం చేశారు. అక్కడున్నTDP నాయకులపై దాడికి దిగారు. దీంతో.. వైసీపీ, టీడీపీ నేతలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. TDP అధినేత పర్యటనను విజయవంతం చేసేందుకు.. టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున కుప్పంకు తరలి వస్తున్నారు. ఎలాగైనా ఈ పర్యటనను అడ్డుకోవాలనే ఉద్దేశంతో.. వైసీపీ నేతలు నిరనస ర్యాలీ చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇరు పార్టీలు పోటాపోటీ ప్రదర్శనలకు సిద్ధమవుతుండటంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola