Bendamoorlanka Farmers Protest: పంటకాలువల అధ్వాన్నస్థితిపై బెండమూర్లంక రైతుల నిరసన

దగ్గరుండి నారుపోయించిన అధికారులు..నీళ్లెందుకు ఇవ్వంట లేదంటూ తూర్పుగోదావరి జిల్లా బెండమూర్లంక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బెండమూర్లంకలో రోడ్డెక్కి ఆందోళన చేసిన రైతులు.....కాలువల్లోకి నీళ్లు రాకుంటే సేద్యమెలా చేయాలంటూ ప్రశ్నించారు. గతంలో కాలువలు అధ్వాన్న స్థితికి చేరుకుంటే చందాలేసుకుని బాగుచేయించుకున్నామని...ఇప్పుడల్లా అలా చేద్దామన్నా ధాన్యం అమ్మిన డబ్బులు ఇప్పటివరకూ ప్రభుత్వం ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తమ పంటకాలువలే ఉదాహరణ అంటూ మండిపడ్డారు రైతన్నలు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola