AP Speaker Tammineni : శ్రీకాకుళం అరసవల్లిలో పర్యటించిన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం | ABP Desam
మనుషులు పాపభీతితో మెసులుకోవాలని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ని సూర్యనారాయణస్వామి దేవస్థానాన్ని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్పీకర్ కు స్వాగతం పలికారు. కరోనా కారణంగా ఆలయ అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుందని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు.