BJP MP Narhari Amin Faints During Photo Session: కాస్త కంగారు, కానీ ఆయన సురక్షితమే..!
దేశ చరిత్రలో ఇవాళ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనంలోకి ఇవాళ ఎంపీలంతా అడుగుపెట్టబోతున్నారు. నిన్నటితో పాత భవనంలో కార్యకలాపాలు ముగిసిపోయాయి. కొత్త భవనంలోకి వెళ్తున్న సందర్బంగా... లోక్ సభ, రాజ్యసభ సభ్యులందరితో కలిసి ప్రధాని మోదీ ఫొటో దిగేలా ఓ సెషన్ నిర్వహించారు. దీనికి అన్ని పార్టీలవారు హాజరయ్యారు. అందరూ ఫొటో సెషన్ కు సిద్ధమవుతుండగా కాస్త టెన్షన్ నెలకొంది. ఓ ఎంపీ కళ్లుతిరిగి పడిపోవడమే కారణం.