Attack on Rahul Gandhi Wayanad Office : వాయనాడ్ ఎంపీ కార్యాలయంపై ఎస్ఐఎఫ్ నేతల దౌర్జన్యం | ABP Desam
కేరళలోని రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగింది. వాయనాడ్ లో రాహుల్ గాంధీ ఎంపీ కార్యాలయంపై ఈ దాడి జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొంత మంది గుంపుగా వచ్చి ఆఫీసు సిబ్బందిపై దౌర్జన్యం, దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిని ఎస్ఎఫ్ఐ నేతలుగా కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఆఫీసుపై దాడికి నిరసనగా కేరళ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దాడులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేరళ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.