2001 Indian Parliament Attack : 2001లో పార్లమెంటు దాడి జరిగిన రోజు ఏమైంది..?
ABP Desam
Updated at:
13 Dec 2023 04:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత్ అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంగా ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటి దేశానికి తలమానికమైన పార్లమెంట్ పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన మన దేశం ఎన్నటికీ మర్చిపోలేదు. డిసెంబర్ 13 2001 అంటే సరిగ్గా ఇదే రోజును ఐదుగురు తీవ్రవాదులు ఆయుధాలతో పార్లమెంటులోకి చొరబడ్డారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది, ఓ తోటమాలి కన్నుమూశారు. దాడికి ప్రతిదాడి చేసిన బలగాలు ఐదుగురు తీవ్రవాదులను మట్టికరిపించాయి.