Chiranjeevi Met his Adoni Fan | తన అభిమాని పిల్లల్ని చదివిస్తానని మాటిచ్చిన చిరంజీవి | ABP Desam

 మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆదోని నుంచి సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్ కు వచ్చిన మహిళ అభిమానిని చిరంజీవి స్వయంగా కలిశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ లకు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండగా రాజేశ్వరి అనే అభిమాని సైకిల్ యాత్ర చేసుకుంటూ ఆదోని నుంచి హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలుసుకున్న మెగాస్టార్ ఆమె అభిమానానికి కదిలిపోయారు. ఇద్దరు పిల్లల ఆ తల్లి తనపై చూపించిన అభిమానికి గుర్తుగా తనతో రాఖీ కట్టించుకున్న మెగాస్టార్ ఆమెకు చీరను బహుమతిగా ఇచ్చి..తండ్రి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆమె పిల్లల్ని తనే చదివిస్తానని హామీ ఇచ్చారు. ఊహించని ఆ బహుమతికి కదిలిపోయిన రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకున్నారు. థాంక్యూ సర్ అంటూ చిరంజీవి అందిస్తానన్న సాయానికి ధన్యవాదాలు తెలిపారు. పిల్లల చదువు కోసమే తాపత్రయపడ్డానని..మెగా ఫ్యామిలీ కి ఎప్పటికీ అభిమానిగానే ఉంటానంటూ మెగా స్టార్ చిరంజీవితో తన బాధను పంచుకున్నారు రాజేశ్వరి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola