Atm Burgled: డోన్ లో దొంగలు హల్ చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఏటీఎంలో చోరీ

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దొంగలు హల్ చల్ చేశారు. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేశారు. ఏటీఎంలో  గ్యాస్ కట్టర్, గడ్డపారాల సహాయంతో  రెండు మిషన్లలో దొంగిలించారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఏటీఎంలో ఎంత నగదు అపహరణకు గురైందన్న విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola