Death Punishment To Murderer: తొమ్మిది నెలల్లోనే తీర్పు | Guntur Fastrack Court | ABP Desam

పరమాయికుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్యను నడిరోడ్డుమీద దారుణంగా చంపిన శశికృష్ణకు ఇవాళ ఉరిశిక్ష ఖరారు చేశారు.  గతేడాది ఆగస్టు 15న రమ్యను శశికృష్ణ దారుణంగా చంపేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన తనని ప్రేమించట్లేదనే కక్షతో రమ్యను హతమార్చాడు. ఈ హత్య కేసులో తుది తీర్పును గుంటూరులోని ప్రత్యేక కోర్టు ఇవాళ వెల్లడించింది. తొమ్మిది నెలల్లోనే విచారణ పూర్తి చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. దాదాపు 28మంది సాక్షులను విచారించాక శశికృష్ణకు ఉరిశిక్ష వేయాలంటూ జస్టిస్ రాంగోపాల్ తీర్పునిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola