బెంగళూరులో మహిళ దారుణ హత్య, 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు

Continues below advertisement

బెంగళూరులో ఒళ్లు జలదరించే ఘటన జరిగింది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు..ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఈ దారుణం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్న బాధితురాలు మహాలక్ష్మి..బిహార్ నుంచి వచ్చినట్టు విచారణలో తేలింది. అయితే..ఈ హత్యకు గల కారణాలేంటన్నది ఇప్పటి వరకూ తెలియలేదు. వారం రోజుల క్రితమే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడం వల్ల స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు లోపలికి వెళ్లి చూడగా..ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. డాగ్‌ స్క్వాడ్‌తో పాటు ఫోరెన్సిక్ టీమ్ కూడా వచ్చి సాక్ష్యాధారాలు సేకరించాయి. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో ఢిల్లీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 28 ఏళ్ల శ్రద్ధావాకర్‌ని తన బాయ్‌ఫ్రెండ్...హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola