బెంగళూరు మహిళ హత్య కేసులో ట్విస్ట్, ఉరి వేసుకున్న నిందితుడు

Continues below advertisement

బెంగళూరు మహిళ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్‌ హత్య కేసుని మరోసారి గుర్తు చేసేలా..అత్యంత దారుణంగా ఈ మర్డర్ జరిగింది. మహిళను ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టి పరారయ్యాడు నిందితుడు. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్న క్రమంలోనే...ఈ వ్యవహారం షాకింగ్ మలుపు తీసుకుంది. మహిళను హత్య చేసిన నిందితుడు ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారన్న  ఒత్తిడిలో చనిపోయాడు. హత్య చేసిన తరవాత ఒడిశాకి పారిపోయిన నిందితుడు..అక్కడే ఊరి చివర ఓ చెట్టుకి ఉరి వేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ 21వ తేదీన ఫ్రిజ్‌లో బాధితురాలి బాడీ పార్ట్స్‌ని గుర్తించారు. అప్పటి నుంచే విచారణ మొదలైంది. అయితే...హత్య చేసే ముందు ఆమెకి విషమిచ్చాడా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉందన్న కోపంతోనే ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తేలింది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగానే...ఉరి వేసుకుని చనిపోయాడు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram