Anantapur News: గణేష్ ఉత్సవాల్లో విషాదం... మండపం వద్ద డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం ఘటన జరిగింది. వినాయకుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ ఓ యువకుడు అకస్మాత్తుగా మృతి చెందిన విషాద ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణం గౌతమిపూరి కాలనీలో చోటు చేసుకుంది. పట్టణంలోని గౌతమిపురి కాలనీలో వినాయక చవితి సందర్భంగా కాలనీవాసులు సంబరాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా కుల్లాయి అనే యువకుడు వినాయకుడి మండపం వద్ద డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా సృహ తప్పిపడిపోయాడు. స్థానికులు ఆ యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే హార్ట్ ఎటాక్ వల్లే చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. అప్పటివరకు తమతోపాటు ఉత్సాహంగా డాన్స్ చేసిన యువకుడు మృతి చెందడంతో కాలనీవాసులు విషాదంలో మునిగిపోయారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola