PM Aawas Yojana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీగా ఇళ్ల నిర్మాణం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధ్యతరగతి కుటుంబాలకు కీలక హామీ ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన కింద 2022-23 ఏడాదిలో 80 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.48,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత ఉన్న లబ్ధిదారులకు పీఎం ఆవాస్ యోజన కింద ఈ ఇళ్లను అందిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, పట్టణ ప్రాంతాల్లో ఉంటోన్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పీఎం ఆవాస్ యోజన.. ఎంతోమంది సొంతింటి కలను నెరవేర్చుతుందన్నారు ఆర్థిక మంత్రి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola