Economic Survey 2022: పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన ఈ టైంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై భారీ అంచనాలున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడటానికి....కరోనా వల్ల కుదేలైన రంగాలను పునరుజ్జీవం పొందటానికి ఈ సారి బడ్జెట్ చాలా కీలకం అని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా గ్రోత్ రేట్ 8-8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో జీడీపీ 9.2శాతంగా నమోదవచ్చని తెలిపింది. మరో వైపు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రీ కోవిడ్ సిచ్యుయేషన్ కి చేరుకుంటుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.