YSRCP vs TDP on Rushikonda Palace | రుషికొండ ప్యాలెస్ పై టీడీపీ వర్సెస్ వైసీపీ ట్విట్టర్ వార్ | ABP

రుషికొండలో నిర్మించినవి ప్రభుత్వ భవనాలే అని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని... అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రుషికొండలో నిర్మాణాలు ఎవరికీ సొంతంకూడా కాదుని, విశాఖపట్నానికి గత ప్రభుత్వం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టినట్లు వైసీపీ చెబుతోంది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలన్నది ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయించి, బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని పోస్ట్ చేశారు. 

ఆర్థిక రాజధాని అని చంద్రబాబు అన్నారు
‘చంద్రబాబు 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖకి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వారు వచ్చినా.. ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదు. ఇక ఇప్పుడు మీరు రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో. కానీ, దానివల్ల విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!’ అని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola