నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగం

YS Vijayamma: తనపై తన కొడుకు హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు. ‘‘చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? ఇటీవలి రెండు లేఖలు నేను రాసినవే.. నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం నా కొడుకుకి లేదు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తా’’ అని విజయమ్మ హెచ్చరించారు. రెండేళ్ల క్రితం కర్నూలులో వైఎస్ విజయమ్మ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటన తెరపైకి వచ్చింది. ఆ ఘటన జగన్‌ వల్లే జరిగిందని.. ఆయనే తల్లిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని టీడీపీ కూడా అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola