నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ సమావేశంలో మహిళా కౌన్సిలర్ల రభస
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీలో అన్నివార్డులను వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన మున్సిపాల్టీల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి మన్సిపాల్టీ ఒకటి. అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా.. మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ దొంతు శారద వర్గం ఎప్పటికప్పుడు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన మున్సిపల్ సమావేశంలో మాజీ ఛైర్ పర్సన్, ప్రస్తుత కౌన్సిలర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ దొంతు శారద సహచర కౌన్సిలర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె వర్గం కౌన్సిలర్లు మీటింగ్ లో హల్ చల్ చేశారు. ప్రస్తుత ఛైర్ పర్సన్ పర్సన్ నక్కా భాను ప్రియ అసలు వైసీపీయా, లేక టీడీపీయా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే ఎక్కువ కాంట్రాక్ట్ పనులు దొరుకుతున్నాయని మరికొందరు విరుచుకుపడ్డారు. మొత్తమ్మీద అందరూ అధికార పార్టీ నాయకులే అయినా కౌన్సిల్ సమావేశం మాత్రం రసాభాసగా మారడం చర్చనీయాంశంగా మారింది.