Uddavolu Teacher Death: ప్రభుత్వ టీచర్ అంత్యక్రియలకు వందలాదిగా జనం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజాం మండలం ఉద్దవోలు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణ హత్యలో... నిందితులను అరెస్ట్ చేసినట్టు నిన్న పోలీసులు వెల్లడించారు. అంతకముందు మాత్రం.... గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిందితులను పోలీసులు అరెస్ట్ చేయటంతో కాస్త అదుపులోకి వచ్చింది. కృష్ణ అంత్యక్రియలకు నిన్న గ్రామమంతా తరలివచ్చింది.