Terrorist Alert In Tirumala: తిరుమల పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెయిల్

తిరుమలలో నిన్న రాత్రి ఒక్కసారిగా కాస్త కంగారు నెలకొంది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈమెయిల్ వచ్చింది.వెంటనే అప్రమత్తమైన తిరుపతి అర్బన్ పోలీసులు.... టీటీడీ సెక్యూరిటీ ఆఫీసర్లను అలెర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. భక్త సంచారం ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. చివరకు దాన్ని ఫేక్ ఈమెయిల్ గా పోలీసులు తేల్చారు. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని, తిరుమలలో భద్రత పటిష్ఠంగా ఉందని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola