నాయుడు పేట - పూతలపట్టు జాతీయ రహదారి ప్రక్కన ఇంటిని ఢీ కొట్టిన ఎర్రచందనం కారు

తిరుపతి,తొట్టంబేడు మండలంలోని నాయుడు పేట - పూతలపట్టు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఎస్టీ కాలనీలోని ఓ ఇంటిని ఎర్రచందనం కారు ఢీ కొట్టింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న భాస్కర్, రత్నం దంపతులకు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందించినా ఇప్పటి వరకూ ఫారెస్ట్ అధికారులు ఎర్రచందనం దుంగలను, గానీ కారును స్వాధీనం చేసుకోకుండా సంఘటనా స్థలానికి రాకపోవడం గమనార్హం.చెక్ పోస్ట్ సమీపంలో ఎర్రచందనం కారు దర్జాగా రవాణా చేస్తున్నా ఫారెస్టు అధికారులు ఏం చెకింగ్ చేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola