Rashi khanna in Tirumala : శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్న రాశీఖన్నా | ABP Desam

తిరుమల శ్రీవారిని సినీనటి రాశిఖన్నా దర్శించుకున్నారు. వేకువజామున స్వామి వారి తోమాలసేవలో పాల్గొన్నారు. సేవ అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట మాట్లాడిన రాశీఖన్నా...జూలై ఒక్కటో తేదీన విడుదలవుతున్న పక్కా కమర్షియల్ సినిమా‌ విజయవంతం కావాలని స్వామివారిని దర్శించుకన్నట్లు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola