Elephants Scare On Tirumala: తిరుమలపై ఏనుగుల సంచారం, భక్తుల్లో ఆందోళన | ABP Desam

Tirumala పై ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. తిరుమల-పాపవినాశనం మార్గంలోని పార్వేటి మండపం వద్ద ఏనుగులు సంచరిస్తున్నాయి. వారం వ్యవధిలో రెండోసారి ఏనుగుల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పాపవినాశనం ప్రాంతానికి భక్తుల ప్రయాణాన్ని టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. ఏనుగులు గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేలా ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. బాణసంచాలు, డప్పులు కొట్టి ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో భక్తులు, స్థానికులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola