ఇచ్చాపురం లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు సంఘీభావ ర్యాలీ.
న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం పట్టణంలో టిడిపి శ్రేణులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ మాట్లాడుతూ సీఎం జగన్ మూడు రాజధానులు నిర్ణయం తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను మోసం చేయడం దారుణమన్నారు.