TDP Protest At Assembly : కాలినడకన అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ నేతలు | DNN | ABP Desam
సంక్షోభంలో సంక్షేమం ఉందంటూ నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభా పక్షం ఆందోళనకు దిగింది. అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన టీడీపీ నాయకులు....అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దు చేయటాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. రేషన్ బియ్యంలోనూ వైసీపీ నేతలు కుంభకోణానికి పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.