Srisailam Ghat Road Accident: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
శ్రీశైలం జలాశయం వద్ద ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. 30 మందికిపైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు... డ్యాం వద్ద టర్నింగ్ తిరిగే సమయంలో అదుపు తప్పి గోడను బలంగా ఢీకొంది. గోడకు ఉన్న ఇనుపరాడ్లను ఢీ కొట్టి ఆగిపోయింది. లేదంటే బస్సు లోయలో పడి భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేది.