Sigachi Fire Accident Updates | నా కొడుకు ఆచూకీ ఎక్కడ..!? | మృతుడు జి.వెంకటేష్ తండ్రి ఆవేదన | ABP

Continues below advertisement

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కెమికల్స్ ఫ్యాక్టరీలో సోమవారం చోటుచేసుకున్న పేలుడు ప్రమాదం ప్రజల గుండెల్లో బీభత్సాన్ని చెరిపివేయలేని ముద్ర వేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 36 మంది మరణించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగా, మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ జరుగుతోంది.

ఈ ఘటనలో చనిపోయిన వారిలో చాలామంది ఉపాధి కోసం తమ ఊళ్లు విడిచి వచ్చిన వలస కార్మికులే. బీహార్, ఒడిశా, యూపీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క వేదన. ఎవరి కళ్లలోనైనా కన్నీరే కనిపిస్తోంది. కొంతమంది కుటుంబానికి ఆశ అయిన కొడుకు, మరికొంతమందికి భర్త, కొందరికి తండ్రి.. ఇలా ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో ఈ ప్రమాదం చీకట్లను నింపింది.

పేలుడు ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యం దీనికి కారణం? అనే ప్రశ్నలు ప్రజల మనసుల్లో మెదులుతున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola