Sand Issue in Vijayanagaram District: విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో ఇసుక తెచ్చిన ఘర్షణ
Viziyanagaram District లో రెండు గ్రామాల మధ్య ఇసుక చిచ్చు రేగింది. పూసపాటిరేగ మండలం లంకలపల్లి - గోవిందపురం గ్రామాల మధ్య ఇసుక రవాణా ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పింది. తమ గ్రామానికి చెందిన కందివలస గెడ్డలో ఇసుక తరలించుకుపోయి వ్యాపారం చేసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగాలంకలపల్లి ప్రజలు ఆగ్రహింవ్యక్తం చేస్తున్నారు. దీనితో రెండుగ్రామల మధ్య వివాదం నెలకొంది. తాజాగా తమ గ్రామంలోని హైస్కూల్లో లంకలపల్లి విద్యార్థులు చదవటానికి వీల్లేదని అడ్డుకున్నారు గోవిందపురం గ్రామస్తులు. ఈ గొడవ పోలీసులు, గ్రామ అధికారులు జోక్యం చేసుకునే స్థాయికి చేరింది.