Godavari Floods: ఉరకలేస్తున్న గోదావరి నది.. వరద నీటితో ఉప్పొంగుతోంది

భారీ వర్షాలకు గోదావరి నది ఉరకలేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ 175 గేట్లను అధికారులు ఎత్తారు. సముద్రంలోకి 4 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 4,700  క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. ముంపు ముప్పులో పోలవరం నిర్వాసిత ప్రాంతాలు ఉన్నాయి. లంక గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాలకు వరద తాకిడి ఎక్కువగా ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola