Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశం

Continues below advertisement

Dr BR Ambedkar Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) అమలాపురంలో (Amalapuram News) మహిషాసుర మర్దిని (Mahishasura Mardini Temple) అమ్మవారి మెడలో పూల దండ వేసేందుకు వేలంపాట నిర్వహించారు. ఇందులో ఆ దండ ఏకంగా లక్ష రూపాయలు పలికింది. ఆ పూల దండను అమ్మవారి మెడలో వేసే అవకాశాన్ని హైదరాబాద్ కు చెందిన భక్తుడు ఆకుల లక్ష్మణరావు దక్కించుకున్నాడు. దీంతో దసరా రోజు అమ్మవారి ఊరేగింపు రోజున దేవత మెడలో ఆ భక్తుడు పూలదండ వేయనున్నారు. సాధారణంగా అమ్మవారికి వచ్చిన చీరలు వేలం పాట పెట్టి అమ్ముతారు కానీ ఇక్కడ మెడలో పూలదండ వేసేందుకు వేలంపాట పెడుతున్నారు. గత కొన్ని సవత్సరాలుగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు కమిటీ సభ్యులు వేలంపాట నిర్వహిస్తుంది.

ఆకుల లక్ష్మణరావు ఫోన్ లో వీడియో కాల్ ద్వారా వేలంపాటలో పాల్గొని అమ్మవారి మెడలో పూల దండ వేలంపాటలో దక్కించుకున్నారు. 12 సంవత్సరాల క్రితం 5 వేల రూపాయలు పలికిన పూలదండ ఏటా పెరుగుతూ ఈసారి రూ.1.03 లక్షలకు చేరింది. అమ్మవారి మెడలో పూల దండ వేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram