Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్

Continues below advertisement

 పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్‌గా ఆయన్ను మార్చారు. పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి మార్పుల తర్వాత  కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెబుతూనే, కూటమిలో ఇబ్బందులు లేకుండా కొత్త కమిటీని వేయమని లోకేష్‌ను నేనే కోరానని వివరణ ఇచ్చారు.  ఈ మధ్య జనసేన పార్టీ నియోజకవర్గ నేతలతో వర్మకు ఇబ్బందులు వచ్చాయి. చంద్రబాబు ఫోటో లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారంటూ వర్మ అభ్యంతరం తెలపడంతో కూటమిలో ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పనులు చేయొద్దంటూ చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు పార్టీ కోసం మాట్లాడుతున్నా.. వర్మకు మద్దతు దక్కడం లేదని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.   పార్టీ బలోపేతం కోసం తాను చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వర్మ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola