
Pawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam
తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. తన తప్పు లేకున్నా ప్రభుత్వంలో భాగస్వామి ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కాబట్టి ప్రజలకు, భక్తులకు క్షమాపణలు చెప్పారు పవన్ కళ్యాణ్. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి పరిస్థితినంతా క్షమించారు. టీటీడీ అధికారుల తప్పును బహిరంగంగా నిలదీయటంతో పాటు బాధితులకు తక్షణ పరిహారం అందించి తన బాధ్యతలను నిర్వర్తించారు. మరి తిరుపతిలో జరిగిన తప్పులో ప్రత్యక్ష భాగస్వామి అయ్యి ఉండి...ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన టీటీడీ ఏం చేస్తోంది. సరిగ్గా ఈ పాయింట్ నే ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముందు మేమేందుకు చెప్పాలి అన్న దగ్గరున్నుంచి టీటీడీ ఏం దిగిరాలేదు...వాళ్లేం దైవాశం సంభూతులు కాదు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే అని సారీ చెప్పే వరకూ తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. తల ఎగరేయటానికి...తలవంచి క్షమించమని కోరటానికి సదరు పెద్దమనుషులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన టైమ్ సరిగ్గా అరగంట. ఆలోపే అంతా మార్చేశాడు. That is pawan Kalyan. ఏం జరిగిందో వివరంగా మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకూ చూడండి.