Pawan Kalyan Lead In Pithapuram | AP Elections Counting |భారీ మెజార్టీ దిశగా పవన్ కల్యాణ్

కుప్పంలో చంద్రబాబునాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, నెల్లిమర్లలో లోకం నాగమాధవి, విశాఖ ఈస్ట్ లో వెలగపూడి, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి, వినుకొండలో ఆంజనేయులు, రాజానగరంలో బత్తుల బలరాంకృష్ణ, పీలేరులో నల్లారి కిషోర్, ఆముదాలవలసలో రవికుమార్, బొబ్బిలిలో బేబినాయన, రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి, నెల్లూరులో వేమిరెడ్డి, నరసరావుపేటలో కృష్ణదేవరాయులు, నంద్యాలలో బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ సహా దాదాపు 110 నియోజకవర్గాల్లో  కూటమి అభ్యర్థులు దూసుకెళుతున్నారు....

రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది పిఠాపురం నియోజకవర్గం ఫలితాల గురించి. ఇక్కడ.. తొలి రౌండ్ నుంచే పవన్ కల్యాణ్ ఆధిక్యత కనబరుస్తున్నారు. పదివేలకు పైగా ఓట్ల ముందంజలో ఉన్నారు. ఈ పరిస్థితిపై పిఠాపురం వాసులు ఏమంటున్నారో ఈవీడియోలో తెలుసుకోండి..! 

ఏపీ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. ఏపీలో బొత్స మినహా మంత్రులంతా వెనుకంజలో ఉన్నారు. ఉదయం 10 గంటల సమయానికి కేవలం 13 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola