Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ పోలింగ్..

నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది.నెల్లూరు నగర వ్యాప్తంగా 384 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి 4,12,700 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగానే ఇచ్చిన ఓటర్ స్లిప్ తో పాటు గుర్తింపు కార్డుతో వచ్చి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుండడంతో ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola