Nellore News : నెల్లూరులో నవ్వించిన కార్పొరేషన్ సిబ్బంది
నెల్లూరు నగరంలో ఉదయం నుంచి ముసురు కమ్మి ఉంది. చిరుజల్లులు పడుతున్నాయి. అయినా కూడా కార్పొరేషన్ సిబ్బంది వాటర్ ట్యాంకర్లు తీసుకుని రోడ్లపైకి వచ్చారు. డివైడర్ల వద్ద మొక్కలకు నీళ్లు పట్టారు. జల్లు మెల్లగా పెరిగింది, జోరు వానగా మారింది. కానీ మొక్కలకు నీళ్లు పట్టడం మాత్రం ఆపలేదు. ఈ సీన్ చూసినోళ్లంతా నవ్వుకుంటున్నారు. మొత్తానికి నెల్లూరు నగరవాసులకి మాత్రం కార్పొరేషన్ సిబ్బంది బాగానే కామెడీ పంచారు.