Nellore MPTC Polling : నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా మొదలైన ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
ABP Desam
Updated at:
16 Nov 2021 01:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరు జిల్లాలో ఎంపీటీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. జిల్లాలో మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 4 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. కోట మండలంలో కోట ఎంపీటీసీ స్థానానికి, కోవూరు మండలంలోని గంగవరం ఎంపీటీసి స్థానానికి, సైదాపురం మండలంలో అనంతపురం స్థానానికి పోలింగ్ మొదలైంది. మొత్తం 12మంది అభ్యర్థులు ఈ 3 స్థానాలకు పోటీ పడుతున్నారు. కోవూరు మండలం గంగవరంలో ఎంపీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా.. ఇక్కడ 1802మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం చిరు జల్లులు పడుతున్నా ఓటర్లు పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు.