సోమువీర్రాజు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం
మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్ధితికి బీజేపీ దిగజారిందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. రేణిగుంట విమానాశ్రయం దగ్గర మీడియాతో మాట్లాడిన నారాయణ స్వామి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం మన్నారు. సోమువీర్రాజు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడా లేక సారాయి దుకాణాలకు అధ్యక్షుడా అర్ధం కావడం లేదని నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. ప్రజలకు అవసరంమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధి వంటి వాటిలో ముందడు వేయాలే గానీ ప్రజలను అనారోగ్యం పాలు చేసే మద్యంని అతితక్కువ ధరకు ఇస్తామని బహిరంగ సభలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.