బోట్లు తీసేందుకు విజయవాడకు కన్నయ్యనాయుడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడ ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ బలంగా తాకి ఇరుక్కున్న బోట్లు బయటకు తీసేందుకు నిపుణుల బృందాన్ని విజయవాడకు రప్పిస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కౌంటర్ వెయిట్ పనుల కోసం ఏపీ జలవనరుల శాఖ సలహాదారుడు, నిపుణుడు కన్నయ్య నాయుడును హైదరాబాద్ నుంచి రప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, గుంటూరు, విజయవాడలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వర్షం పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాగార్జున సాగర్, పులిచింతల నుండి నీరు విపరీతంగా వస్తోందని, మున్నేరు, బుడమేరు నుంచి నీళ్లు రావడంతో వరద ఎక్కువైందని తెలిపారు. కొల్లేరుకు నీరు వెళ్లే మార్గాన్ని గత ఐదేళ్ల పాటు నిర్లక్ష్యం చేయడంతో విజయవాడలోకి నీళ్లు వచ్చి చేరాయని పేర్కొన్నారు. సింగ్ నగర్కు బోట్ లో వెళ్లి బాధితులను పరామర్శించానన్నారు. వారి కష్టాలు చూసి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో వారికి న్యాయం చేసి నమ్మకం కలిగిచేందుకు కలెక్టర్ కార్యాలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.