రాజమండ్రిలో చిరుత, ఎక్కడెక్కడ తిరుగుతోందో కెమెరాల్లో రికార్డ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాలుగు రోజులుగా రాజమండ్రిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. రాజమండ్రి శివారు దివాన్చెరువు ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో రికార్డవటంతో ఆ ప్రాంతంలో అలజడి రేగుతోంది. ఒంటరిగా రాత్రిళ్లు సంచరిచ్చొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ..అసలు చిరుత కదలికలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయి. అధికారులు తీసుకుంటున్న చర్యలేంటీ ఈ వీడియోలో. ఇప్పటికే దివాన్ చెరువు వద్ద చిరుత పాదముద్రలు గుర్తించారు అటవీ అధికారులు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ పగ్ మార్క్స్ని బట్టి అది చిరుత పులేనని DFO కన్ఫమ్ చేశారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరవాత ఎవరూ బయటకు రావద్దని, బయట కూర్చోవద్దని సూచించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చినా తప్పకుండా టార్చ్లైట్ తీసుకెళ్లాలని చెప్పారు. పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే స్థానికులతో ABP దేశం ప్రత్యేకంగా మాట్లాడింది. అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకుంది.