Ananta TDP : టీడీపీ నిర్వహించే సదస్సులు శుద్ధ దండగా.. పార్టీ నేతలపై జేసీ ప్రభాకర్‌ సీరియస్ కామెంట్స్

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఉన్న గ్రూపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాయలసీమ ప్రాజెక్టుల అంశంపై టీడీపీ నేతలు రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.  రాయలసీమకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారని ప్రకటించారు. అయితే ఈ సమావేశంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోని నేతలంతా ఇప్పుడు సదస్సులంటూ బయలుదేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola