Pawan Kalyan Tours Kurnool District: కౌలు రైతు భరోసా యాత్రలో జనసేనాని పవన్ కల్యాణ్ | ABP Desam
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన నలుగురు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందచేస్తారు. పవన్ కళ్యాణ్ కు విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి శిరివెళ్లకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.
Tags :
Pawan Kalyan Kurnool Pawan Kalyan Kurnool Tour Kurnool Tour Pawan Kalyan Raithu Bharosa Yatra Raithu Bharosa Yatra