Kuppam Illegal Mining : నారా చంద్రబాబు నాయుడు ఆరోపణతో కుప్పంలో మైనింగ్ అధికారులు దాడులు

Continues below advertisement

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అక్రమ క్వారీలపై అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. నాలుగు బృందాలుగా మైనింగ్ అధికారులు, అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్వారీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన రెండు వారాలుగా క్వారీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని గుర్తించిన అధికారులు, సంబంధిత వాహనాలను అలాగే తరలింపుకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ దిమ్మెలను సీజ్ చేశారు. తన నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అక్రమ క్వారీకి పాల్పడుతున్నారంటూ, ఏపి ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram