Kesavapuram Post office : ఖాతాదారుల డబ్బుతో కనపడకుండా పోయిన పోస్ట్ మాస్టర్ | ABP Desam
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పరిధిలోని కేశవపురం పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్టుమాస్టర్ సీహెచ్ సుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్ము పోస్టాఫీసులో దాచుకున్నామని.... పోస్టుమాస్టర్ డబ్బుతో పరారీ అయ్యాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.