Kanipakam Temple Mula Virat Photos: సోషల్ మీడియాలో మూలవిరాట్ ఫొటోలు వైరల్

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. అధికారుల నిఘా వైఫల్యం బయటపడిందని భక్తులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుడు బాలవెంకటరెడ్డి యాదవ్ దంపతులు.... 2 రోజుల క్రితం ఆలయానికి వచ్చారు. వారితో పాటు వచ్చిన అనుచరుడు ఒకరు.... దర్శన సమయంలో మూలవిరాట్ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అధికారులు, అర్చకులు ఎవరూ దీన్ని అడ్డుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని ఆలయ పాలకమండలి ఛైర్మన్ మోహన్ రెడ్డి చెప్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola