ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్‌ కంటతడి
బాలల హక్కుల దినోత్సవ సభలో ఘటన

కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్‌ కంటతడి పెట్టారు. కాకినాడలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభ జరిగింది. చీఫ్ గెస్ట్ గా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ వచ్చి మాట్లాడారు. ఉపాధ్యాయులైన తన తల్లిదండ్రులు ఎంతో నిబద్ధతతో వృత్తిధర్మాన్ని పాటించారు కాబట్టే తాము ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. వారు సక్రమంగా విధులు నిర్వహించకపోయి ఉంటే ఆ పాపం తమకు తగిలేదన్నారు. ఈ సందర్భంలో కంటతడి పెట్టారు. కొంతమంది ఆ బాధ్యతను విస్మరిస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఏ ఉపాధ్యాయుడు తన వృత్తి ధర్మాన్ని పాటించరో.. ఆయన పిల్లల జీవితాలను నాశనం చేసినవారవుతారు. నిబద్ధతతో చేయకపోయినా, విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దకపోయినా ఆ పాపం తగులుతుంది’’ అని పేర్కొన్నారు. ఇలాంటి సభల్లో తాను ఎక్కువగా మాట్లాడనని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మాట్లాడుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.                             

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola