అసభ్య పోస్ట్‌ల వెనక అవినాష్ రెడ్డి! ఆయనదే కీలక పాత్ర - డీఐజీ

ఏపీలో గత వారం రోజులుగా సోషల్ మీడియా సైకోలు అంటూ ఓ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా అసభ్యకర పోస్టులు పెడుతుండడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇందులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిది కీలక పాత్ర ఉందని భావిస్తున్నామని కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ చెప్పారు. అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి ద్వారా సమాచారం తీసుకొని తాను ఆ పోస్టులు పెట్టానని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పారని వివరించారు. అవినాష్‌రెడ్డి చెప్తుంటే.. ఆయన పీఏ రాఘవరెడ్డి డైరీలో రాసుకొనేవాడని వర్రా రవీందర్ చెప్పినట్లుగా డీఐజీ తెలిపారు. అలా తాను జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందర్ రెడ్డి ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో వర్రా రవీందర్‌రెడ్డి ఆల్రెడీ అరెస్టు అయ్యారు. మరో ఇద్దరు నిందితులు సుబ్బారెడ్డి, ఉదయ్‌లను పోలీసులు సోమవారం కడపలో మీడియా ఎదుట ప్రవేశపెడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola