Dasalamma Temple: కడపజిల్లా వరదల్లో తోగూరుపేట వాసులకు ఆశ్రయిమిచ్చిన దాసాలమ్మ ఆలయం
కడపజిల్లా చెయ్యేరు నది పరివాహక ప్రాంతాల్లో వరదలు భారీ నష్టాన్నే మిగిల్చాయి. ప్రత్యేకించి నందలూరు మండలం తోగూరుపేట గ్రామంలో ప్రజలు వరదల నుంచి తప్పించుకునేందుకు దాసాలమ్మ గుట్ట ఎక్కారు. గ్రామానికి 80అడుగుల పైన ఉండే దాసాలమ్మ గుట్ట ఆలయంలో తలదాచుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల ధాటికి ఊరంతా మునిగిపోయినా...ఆలయంలో ఉన్న తమకు ఏం కాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. దాసాలమ్మ దయ వలనే తామంతా ప్రాణాలతో ఉన్నామని విశ్వసిస్తున్న గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.