Liquor Smuggling: కర్నూలు జిల్లాలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్

పువ్వుల చాటుగా అక్రమ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు,డోన్ ఇతర ప్రాంతాల్లో పువ్వుల వ్యాపారం చేస్తూ బుట్టలో మద్యం బాటిళ్లు సరఫరా చెస్టన్నట్లు డోన్ పోలీసులు తెలిపారు. డోన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే అసోషియేషన్ దగ్గర ఉండాగా ఇద్దరువ్యక్తులను అదుపులోకి తీసుకన్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారి వద్దవున్న పువ్వుల బుట్టలను తనిఖీ చేయగా తెలంగాణ మద్యం సుమారు 19 మద్యం బాటిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పువ్వులు అమ్మేందుకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తెలంగాణ ప్రాంతం నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి పువ్వుల చాటున బుట్టల్లో మధ్యం తీసుకొచ్చి డోన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో అధికధరలకు అమ్ముతున్నారన్న ముందస్తు సమాచారం మేరకు వారు పట్టుకున్నట్లు తెలిపారు.షేక్ మస్తాన్ వలి,సల్మాన్ రాజు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola